ఏపీలో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య - ఏపీ తాజా వార్తలు
ఏపీలోని అనంతపురం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బలవన్మరణానికి గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు.
![ఏపీలో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య 3-persons-from-same-family-suicide-in-ananthapuram-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10929037-213-10929037-1615255124447.jpg)
ఏపీలో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
ఏపీలోని అనంతపురం జిల్లాలో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. గార్లదిన్నె మండలం.. యర్రగుంట్ల గ్రామంలో ఒకే కుటుంబంలో తల్లి, తండ్రి, కుమారుడు ఇంట్లోనే విషపు గుళికలు మింగి మరణించారు. తండ్రి రామకృష్ణ (45), తల్లి రాజేశ్వరి(35) , కుమారుడు దేవేంద్ర (14) ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
- ఇదీ చదవండి :మెదక్ జిల్లాలో పెట్రోల్ దాడికి గురైన మహిళ మృతి