నిషేధిత గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు హయత్ నగర్లో అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని అరకు నుంచి ఉత్తరప్రదేశ్కు గంజాయిని ఇద్దరు తరలిస్తుండగా.. సమాచారం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 200 కేజీల గంజాయి, ఒక లారీ, రూ. 15వేల నగదు, మూడు చరవాణీలను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన గంజాయి విలువ రూ. 40లక్షలపైనే ఉంటుందని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు చెప్పారు.
హయత్నగర్లో గంజాయి పట్టివేత.. రిమాండ్కు నిందితులు - marijuana seized in hayathnagar news
నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 200 కేజీల గంజాయి, లారీ, నగదు స్వాధీనం చేసుకున్నారు.
![హయత్నగర్లో గంజాయి పట్టివేత.. రిమాండ్కు నిందితులు marijuana seized](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11399659-875-11399659-1618393769980.jpg)
గంజాయి స్వాధీనం