వరంగల్ అర్బన్ జిల్లాలో వినాయక చవితి వేడుకలు... కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా, నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. హన్మకొండలోని సుప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయంలో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ, ప్రభుత్వ ఛీప్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గి, ప్రజలందరూ చల్లగా ఉండాలని ఆ విఘ్నేశ్వరుని వేడుకున్నట్టు చెప్పారు. అందరూ మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.