'అధిక ధరలు వసూల్ చేసే డయాగ్నోస్టిక్ సెంటర్లపై చర్యలు'
అధిక ధరలు వసూల్ చేసే డయాగ్నోస్టిక్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ హెచ్చరించారు. కష్టకాలంలో పేదల వద్ద దండుకోవద్దని కోరారు.
ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, డయాగ్నోస్టిక్ సెంటర్లు
వరంగల్లో అధిక ధరలు వసూల్ చేసే డయాగ్నోస్టిక్ సెంటర్లపై కఠిన చర్యలు తప్పవని చీఫ్ విప్ వినయభాస్కర్ హెచ్చరించారు. జిల్లాలో కరోనా కట్టడి, ధరల నియంత్రణకు కలెక్టర్ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశారు. పలు ల్యాబ్లలో నిర్ణీత ధరల కంటే అధికంగా వసూళ్లు చేస్తున్నారని కొంతమంది ఫిర్యాదు చేశారు. వెంటనే చీఫ్ విప్ వినయభాస్కర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు చేసింది. దీనిపై మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి అందించారు...
- ఇదీ చదవండి :చిన్నారిని అనాథ చేసిన కరోనా