వరంగల్లో మొబైల్ కోర్టును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థలో ఆన్లైన్ ద్వారా న్యాయమూర్తులు కేసులను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.
న్యాయవాదులు కోర్టుకు రాకుండానే కేసుల పరిష్కారం - హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్
వరంగల్లో మొబైల్ కోర్టును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్.చౌహాన్ ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. కరోనా కారణంగా కేసుల పరిష్కరానికి న్యాయవాదులు కోర్టుకు రాకుండానే ఆన్లైన్ ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపారు. పిటిషన్ వంటి వాటిని సమర్పించడం చేయవచ్చని ఆయన వివరించారు.
![న్యాయవాదులు కోర్టుకు రాకుండానే కేసుల పరిష్కారం Settlement of cases without coming to court at mobile court warangal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7818335-293-7818335-1593428996591.jpg)
న్యాయవాదులు కోర్టుకు రాకుండానే కేసుల పరిష్కారం..
ఈ మేరకు నాలుగు మొబైల్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాటి ద్వారా న్యాయవాదులు కేసులకు సంబంధించిన విషయాలను కోర్టుకు రాకుండా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. తమ దగ్గరలోని మొబైల్ కోర్టు కేంద్రం నుంచి ఆన్లైన్లో న్యాయ మూర్తులతో కేసులకు సంబంధించిన విషయాలు పంచుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.
కోర్టుకు రాకుండానే కేసుల పరిష్కారం..
ఇదీ చూడండి :పెట్రో ధరలపై సైకిలెక్కి జగ్గారెడ్డి వినూత్న నిరసన