తెలంగాణ

telangana

By

Published : Mar 19, 2020, 7:56 PM IST

ETV Bharat / city

కరోనా భయంతో పెళ్లిల్లకు బంధుమిత్రుల దూరం

కరోనా ప్రభావం శుభకార్యాలపైనా పడింది. వేల మంది రావాల్సిన వేడుకలకు 200 మంది కూడా రావడం లేదు. పెళ్లిల్లలో సందడి తగ్గినా అందరి ఆరోగ్య దృష్ట్యా ఇదే ఉత్తమమని, ఆచరణీయమని చెపుతున్నారు. కరోనా నివారణకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తున్నారు.

marriage halls withuot guests due to carona afride
కరోనా భయంతో బంధుమిత్రుల దూరం

కరోనా దెబ్బతో పెళ్లి సందడి కరవైంది. సకుటుంబ సపరివార సమేతంగా రావాలంటూ ఆహ్వానం పంపినా చాలా మంది శుభకార్యాలకు గైర్హాజరవుతున్నారు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే హాజరవుతున్నారు. వధూవరులు కూడా ముఖ్యులు మాత్రమే వస్తే చాలని భావిస్తున్నారు. ఫలితంగా దాదాపు సగం మండపాలు ఖాళీగానే కనిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ 700 పెళ్లిళ్లు జరిగితే... ఎక్కడా 200 మంది కూడా కనిపించలేదు. వచ్చినా త్వరత్వరగా ఆశీర్వదించి వెళ్లిపోతున్నారు. రాలేకపోయినవారు చరవాణుల్లో శుభాకాంక్షలు చెబుతున్నారు.

కొంతమంది మాస్కులు, శానిటైజర్లతో తగు జాగ్రత్తలు తీసుకుంటూ హాజరవుతున్నారు. గతంతో పోలిస్తే.. కరోనా వైరస్​పై ప్రజల్లో అవగాహన పెరిగింది. అయిప్పటికీ ఇది సరిపోదని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే రెండు, మూడు వారాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనాను తరిమికొట్టేందుకు పౌరులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, ఇతరులకు దూరంగా ఉండాలని అన్నారు.

కరోనా భయంతో బంధుమిత్రుల దూరం

ఇదీ చూడండి:దేశంలో కరోనాకు మరొకరు బలి- 4కు చేరిన మృతులు

ABOUT THE AUTHOR

...view details