తెలంగాణ

telangana

ETV Bharat / city

పస్రాలో లారీ బీభత్సం.. వాహనాలు ధ్వంసం - ములుగులో లారీ బీభత్సం

ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం పస్రా వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి రద్దీగా ఉన్న షాపులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి.

రద్దీగా ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ.. ఇద్దరికి గాయాలు
రద్దీగా ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ.. ఇద్దరికి గాయాలు

By

Published : Oct 21, 2020, 4:55 PM IST

ములుగు జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. గోవిందరావు పేట మండలం పస్రా వద్ద ఓ లారీ అదుపు తప్పి రహదారి పక్కన రద్దీగా ఉన్న దుకాణ సముదాయంలోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐదు ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

రద్దీగా ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ.. ఇద్దరికి గాయాలు


ఇవీ చూడండి:కిడ్నాప్​ కథ సుఖాంతం... నిందితుల అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details