ఈ నెల 12న జిల్లాలోని కోర్టుల్లో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు.. వరంగల్ గ్రామీణ జిల్లా పాలనాధికారి హరిత వెల్లడించారు. కక్షిదారులు రాజీమార్గంలో కేసుల పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు.
12న లోక్ అదాలత్... రాజీయే రాజ మార్గం: కలెక్టర్ హరిత
వరంగల్ న్యాయ సేవా సంస్థ పర్యవేక్షణలో జిల్లా న్యాయస్థానాల్లో ఈ నెల 12న లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత తెలిపారు. ఈ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని సూచించారు.
ఈ నెల 12న లోక్ అదాలత్... రాజీయే రాజ మార్గం: పాలనాధికారి హరిత
కుటుంబ తగాదాలు, క్రిమినల్, బ్యాంకు లావాదేవీల సంబంధిత కేసులు, ఎక్సైజ్, రవాణా ఇతరత్రా సమస్యల పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి వేదికని కలెక్టర్ హరిత వివరించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: భాజపాలోకి వలసలు: రాములమ్మ ఓకేనట.. జానా డౌటేనట!