తెలంగాణ

telangana

ETV Bharat / city

కన్నుల పండువగా శ్రీలక్ష్మీ నరసింహుని కల్యాణం - వరంగల్​ అర్బన్​ జిల్లా వార్తలు

బందనపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. ఎడ్లబండ్లపై వచ్చిన భక్తులు స్వామి వారి కల్యాణ వేడుకను చూసి పరవశించిపోయారు.

కన్నుల పండువగా శ్రీలక్ష్మీ నరసింహుని కల్యాణం
కన్నుల పండువగా శ్రీలక్ష్మీ నరసింహుని కల్యాణం

By

Published : Mar 10, 2020, 2:04 PM IST

Updated : Mar 10, 2020, 2:50 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా రాయపర్తి మండలం బందనపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల జయ జయ ధ్వానాల నడుమ స్వామి వారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఎడ్లబండ్లపై వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. స్వామివారి కల్యాణాన్ని తిలకించి పులకించిపోయారు.

దివ్య ముహూర్త సమయాన దేవతామూర్తుల శిరస్సుపై జీలకర్ర బెల్లం పెట్టారు. మంగళ సూత్రధారణను పండితులు రమణీయంగా నిర్వహించారు. అనంతరం తలంబ్రాల ఘట్టాన్ని నిర్వహించారు అర్చకులు.

కన్నుల పండువగా శ్రీలక్ష్మీ నరసింహుని కల్యాణం

ఇవీ చూడండి:దాహార్తికై వచ్చి.. కెమెరాకు చిక్కిన పులులు

Last Updated : Mar 10, 2020, 2:50 PM IST

ABOUT THE AUTHOR

...view details