తెలంగాణ

telangana

ETV Bharat / city

'వేతనాలు అందకపోతే... ఆందోళన ఉద్ధృతం' - undefined

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​లో మున్సిపల్​ కార్మికులు ఆందోళనకు దిగారు. మూడు నెలలుగా జీతాలు అందడం లేదని మున్సిపల్​ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈనెల 10లోపు వేతనాలు అందకపోతే... ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

అమీన్​పూర్​లో ఆందోళనకు దిగిన మున్సిపల్​ కార్మికులు

By

Published : Apr 2, 2019, 10:17 PM IST

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మున్సిపాలిటీలో మున్సిపల్​ కార్మికులు వేతనాలు అందడం లేదని ఆందోళనకు దిగారు. గత మూడు నెలలుగా వేతనాలు అందడం లేదని అంటూ... సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మున్సిపల్​ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. వేతనాలు రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
స్పందించిన మున్సిపల్​ కమిషనర్​ వేమనా రెడ్డి రెండు నెలల వేతనాలు కార్మికుల బ్యాంకు ఖాతాల్లో వేశామని స్పష్టం చేశారు. ఆర్థిక సంవత్సరం చివరినెల అయినందున వేతనాలు ఆలస్యమయ్యాయని తెలిపారు. మరో రెండు రోజుల్లో అందుతాయని హామీనిచ్చారు.
ఈనెల 10వ తేదీలోపు వేతనాలు అందకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని కార్మిక సంఘం నాయకులు హెచ్చరించారు.

అమీన్​పూర్​లో ఆందోళనకు దిగిన మున్సిపల్​ కార్మికులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details