తెలంగాణ

telangana

ETV Bharat / city

నిజామాబాద్​ డీసీసీబీ ఛైర్మన్​పై అవిశ్వాసం..!

నిజామాబాద్​ డీసీసీబీ పాలకవర్గంలో ఛైర్మన్​పై సొంత పార్టీ సభ్యులే అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. అవిశ్వాస తీర్మానానికి సైతం పట్టుపట్టినట్లు తెలుస్తోంది. మంత్రి ప్రశాంత్​రెడ్డిని కలిసిన అనంతరం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

By

Published : Dec 24, 2019, 6:07 PM IST

nizamabad dccb
నిజామాబాద్​ డీసీసీబీ ఛైర్మన్​పై అవిశ్వాసం..!

నిజామాబాద్ డీసీసీబీ పాలకవర్గం సమావేశంలో ఛైర్మన్​పై అసంతృప్తి వ్యక్తమైంది. పాలనాపరమైన వ్యవహారాలపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఛైర్మన్ గంగాధర్ పట్వారపై అవిశ్వాస తీర్మానానికి సొంత పార్టీ సభ్యులే పట్టు పట్టినట్లు తెలుస్తోంది. అందుకు మెజార్టీ సభ్యులు అంగీకరించినట్లు సమాచారం. మంత్రి ప్రశాంత్​రెడ్డికి సమస్య వివరించి, ఆయన అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించి సమావేశం ముగించారు.

ఇదే విషయమై స్పీకర్ పోచారంను కలిసిన సభ్యులు పరిస్థితిని వివరించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డిని కలిసిన తర్వాత అవిశ్వాస తీర్మానంపై సభ్యులంతా ఒక నిర్ణయానికి రానున్నారు. అధికార పార్టీకి చెందిన సభ్యులే ఛైర్మన్​పై అవిశ్వాసానికి పట్టుబట్టడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

నిజామాబాద్​ డీసీసీబీ ఛైర్మన్​పై అవిశ్వాసం..!

ఇవీచూడండి: 'ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details