తెలంగాణ

telangana

By

Published : Jan 6, 2021, 2:41 AM IST

ETV Bharat / city

ఆవుపై చిరుత దాడి.. భయాందోళనలో తండా వాసులు

రాష్ట్రంలో చిరుత పులిదాడులు పెరుగుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని కొండాపూర్ గుడి తాండాలో చిరుత దాడి కలకలం సృష్టించింది. ఓ ఆవుపై దాడి చేసి చంపింది. దీంతో గ్రామస్థులు భయభ్రాంతులుకు గురయ్యారు.

Leopard attack on cow
ఆవుపై చిరుత దాడి

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని కొండాపూర్ గుడితండాలో చిరుత కలకలం సృష్టించింది. మంగళవారం తండా సర్పంచ్ దేవిదాస్​కు చెందిన ఆవుపై దాడి చేసి చంపింది. సర్పంచ్ తెలిపిన వివరాల ప్రకారం ప్రతి రోజు మాదిరిగానే సర్పంచ్ తల్లి.. ఆవును పశుగ్రాసం కోసం అడవిలోకి తీసుకెళ్లింది. ఓ చోట కట్టేసి తన పనిలో నిమగ్నమైంది. అడవిలోంచి ఒక్కసారిగా బయటకు వచ్చిన చిరుత ఆవు గొంతు పట్టుకుని దాడి చేసింది.

అక్కడే ఉన్న గొర్రెల కాపరులు కేకలు వేయగా ఆవును గుట్టపక్కకు లాక్కెళ్లి ఆవును చంపేసింది. గత నెలలో కూడా చిరుత ఓ దూడపై దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. చిరుత దాడితో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. చిరుత సంచారంతో ఆ ప్రాంత వాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుత నుంచి కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇవీ చూడండి:భయం భయం: హడలెత్తిస్తున్న చిరుతల సంచారం

ABOUT THE AUTHOR

...view details