తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎంపీ అర్వింద్​కు సీఐటీయూ వినతి - anganwadi problems

నిజామాబాద్​లో ఎంపీ అర్వింద్​కు సీఐటీయూ నాయకులు వినతిపత్రం అందజేశారు. అంగన్​వాడీల సమస్యలపై పార్లమెంట్​ సమావేశాల్లో మాట్లాడాలని కోరారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ఎంపీని కోరారు.

citu leaders gave request letter to mp arvind in nizamabad
citu leaders gave request letter to mp arvind in nizamabad

By

Published : Jan 9, 2021, 9:49 PM IST

అంగన్​వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ... నిజామాబాద్​లో ఎంపీ అర్వింద్​కు సీఐటీయూ నాయకులు వినతిపత్రం అందజేశారు. 2020 నూతన జాతీయ విద్యావిధానం చట్టంలో ఐసీడీఎస్​ ప్రస్తావనే లేదని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్​ ఆరోపించారు. అంగన్​వాడీ ఉద్యోగులకు నష్టం కలిగించే నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ఎంపీని కోరారు.

'పార్లమెంటులో అంగన్వాడీల సమస్యలపై మాట్లాడండి'

అంగన్​వాడీ కేంద్రాలను బలపరచి... మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్​ చేశారు. అంగన్​వాడీలకు కనీస వేతనం రూ .21,000/- లు చెల్లించాలని కోరారు. అంగన్​వాడీ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ అర్వింద్​కు ఓ వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో అంగన్​వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వర్ణ, అంగన్​వాడీ జిల్లా నాయకులు అనుసూయ, భూమవ్వ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:మంత్రి కేటీఆర్​ శంకుస్థాపనలు... ప్రతిపక్షాల ఆందోళనలు

ABOUT THE AUTHOR

...view details