తెలంగాణ

telangana

ETV Bharat / city

Yadadri temple news: యాదాద్రి ప్రధానాలయాన్ని నిర్మించిన కృష్ణశిల.. ఓ రంగుల కళ! - కృష్ణశిల తాజా వార్తలు

Yadadri temple news: శిల్పశాస్త్రంలో కృష్ణశిలకు ఉత్తమ పురుష శిలగా ఓ ప్రాధాన్యముంది. మహాదివ్య క్షేత్రంగా పునర్నిర్మితమవుతోన్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయాన్ని ఆ శిలలతోనే పునర్నిర్మించిన విషయం తెలిసిందే. మార్చి 28న యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతటి విశేషమైన కృష్ణ శిల గురించి ఓ సారి చూద్దాం.

Yadadri temple news
Yadadri temple news

By

Published : Feb 18, 2022, 11:37 AM IST

Yadadri temple news: శిల్పశాస్త్రంలో కృష్ణశిలకు ఉత్తమ పురుష శిలగా ఓ ప్రాధాన్యముంది. విశ్వఖ్యాతి చెందేలా పునర్నిర్మితమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయాన్ని ఆ శిలలతోనే పునర్నిర్మించారు. విగ్రహాలు చెక్కడానికి అత్యంత విశేషమైనదిగా కృష్ణశిల(బ్లాక్ గ్రానైట్)ను వ్యవహరిస్తారని యాదాద్రి ఆలయ నిర్మాణ ప్రధాన స్థపతి వేలు ఆనందచారి తెలిపారు. భాస్వరం వంటి ఖనిజాల సమ్మేళనంగా ఈ శిల రూపుదిద్దుకుంటుందని.. ఆ శిలతో చెక్కిన విగ్రహాన్ని అభిషేకించిన జలంలోనూ అనేక ఔషధ గుణాలు ఉంటాయని అన్నారు. ఈ రాతిని శిల్పంగా మలిచేటప్పుడు అగ్ని పుడుతుందని ఆయన వివరించారు.

కృష్ణ శిలతో నిర్మితమైన యాాదాద్రి క్షేత్రం

గుంటూరు జిల్లా కమ్మవానిపాలెం, ప్రకాశం జిల్లా గురిజేపల్లి మధ్య ఉన్న ఉత్తమమైన కృష్ణశిలలను భారీగా సంగ్రహించి.. యాదాద్రి ఆలయానికి వినియోగించినట్లు వేలు పేర్కొన్నారు. ఈ శిలలు పగటి ఎండలో శ్వేతవర్ణంలో కనిపిస్తాయని.. సూర్యాస్తమయ సమయంలో ఎరుపు రంగు పులుముకొంటాయని అన్నారు. వాన నీరు జాలువారినప్పుడు సహజ వర్ణమైన నల్లటి రంగులోకి మారుతాయని ఆలయ ప్రధాన స్థపతి వేలు ఆనందచారి వివరించారు.

కృష్ణ శిలతో నిర్మితమైన యాాదాద్రి క్షేత్రం

ఇదీ చదవండి:YADADRI NEW LIGHTING: ఆధ్యాత్మికత ఉట్టిపడేలా.. యాదాద్రి జిగేల్ మనేలా

ABOUT THE AUTHOR

...view details