తెలంగాణ

telangana

ETV Bharat / city

అండర్​ పాస్​ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తా: ఉత్తమ్ - ఉత్తమ్ రైల్వే ట్రాక్​ పరిశీలన

నల్గొండ జిల్లా తప్పలమ్మగూడెం రైల్వేట్రాక్​ను ఎంపీ ఉత్తమ్ కుమార్​ రెడ్డి పరిశీలించారు. వ్యవసాయ పనులకు వెళ్లేందుకు ట్రాక్​ అడ్డంగా ఉందని స్థానికులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిష్కారిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

అండర్​ పాస్​ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తా: ఉత్తమ్
అండర్​ పాస్​ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తా: ఉత్తమ్

By

Published : May 31, 2020, 6:32 PM IST

Updated : May 31, 2020, 7:02 PM IST

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం తిప్పలమ్మగూడెంలోని రైల్వే ట్రాక్​ను టీపీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్​ రెడ్డి పరిశీలించారు. రైల్వే ట్రాక్​ అడ్డంగా ఉండటం వల్ల వ్యవసాయ పనుల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని స్థానిక రైతులు ఉత్తమ్​కు విన్నవించారు. అండర్ పాస్​ బ్రిడ్జి ఏర్పాటు చేసి తమ సమస్య పరిష్కరించాలని కోరారు.

స్పందించిన ఎంపీ రైల్వే జనరల్ మేనేజర్​తో మాట్లాడి సత్వరమే సమస్య పరిష్కారిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, పున్న కైలాష్ నేత, మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్, నల్గొండ ఎంపీపీ సుమన్​, మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన్ పాశం నరేష్ రెడ్డి, పీఏసీఎస్ మాజీ ఛైర్మన్ బొంత వెంకటయ్య, ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య, నాయకులు దొంతినేని నాగేశ్వర్ నావు, తండు నర్సింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:మంత్రి జగదీశ్​రెడ్డి వర్సెస్ ఉత్తమ్​కుమార్​రెడ్డి

Last Updated : May 31, 2020, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details