తెలంగాణ

telangana

By

Published : Apr 27, 2020, 11:49 PM IST

ETV Bharat / city

'తెరాసను లెక్కచేయలే.. కేసీఆర్​ను హేళన చేసిన్రు'

తెరాస ఆవిర్భావ వేడుకలు నల్గొండలో ఘనంగా నిర్వహించారు. మంత్రి జగదీశ్ రెడ్డి హాజరై జెండా ఆవిష్కరించారు. 120 ఏళ్లలో చేయలేని పనులు తెరాస అనతి కాలంలోనే చేసి చూపిందని మంత్రి పేర్కొన్నారు.

minister jagadish reddy participate in nalgonda trs foundation day celebrations
'తెరాసను లెక్కచేయలే.. కేసీఆర్​ను హేళన చేసిన్రు'

నల్గొండలో నిర్వహించిన తెరాస 20వ ఆవిర్భావ వేడుకలకు మంత్రి జగదీశ్ రెడ్డి హాజరై జెండా ఆవిష్కరించారు. తక్కువ కాలంలోనే ఎన్నో విజయాలు, అద్భుతమైన పలితాలు సాంధించినట్టు మంత్రి పేర్కొన్నారు. నవ సమాజ నిర్మాణానికి కేసీఆర్ నాయకత్వంలో పునాది పడిందన్నారు. 120 ఏళ్లలో చేయలేని పనులు అనతి కాలంలోనే చేసి చూపించినట్టు తెలిపారు.

జలదృశ్యంలో తెరాస పురుడు పోసుకున్న రోజు... ఎవరూ లెక్క చేయలేదు. కేసీఆర్​ దగ్గర ఏంముందని హేళన చేశారు. ప్రపంచాన్ని మాయ చేస్తామనే అహంకారం ఉన్నవాళ్లు కేసీఆర్​ను నలిపేస్తామన్నారు. ఎవరికేం కావాలో గమనించి పథకాలు ప్రవేశపెడుతున్నట్టు వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్​ రెడ్డి. చిరుమర్తి లింగయ్య, జడ్పీ ఛైర్మన్​ బండా నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితుల్లో మెరుగుదల'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details