భారత్ -చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబుకు పరమ వీరచక్ర అవార్డు ఇవ్వాలని పలువురు కోరారు. భారత సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఆకృతి సంస్థ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంతోష్ బాబు సేవలను కొనియాడారు.
ధన్యవాదాలు...
ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా ట్రైనీ డిప్యుటీ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి పాల్గొన్నారు. దేశం కోసం తన భర్త చేసిన త్యాగాన్ని గుర్తించి.. తమ కుటుంబాన్ని ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన భర్త ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజానికి తనవంతు సేవలందిస్తానన్నారు.