మహిళలు స్వయం సమృద్ధి దిశగా ఎదిగేందుకు ఉచిత శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు డా. ఆరుట్ల కమలాదేవి రామచంద్రా రెడ్డి ఫౌండేషన్ ఛైర్మన్ సుశీలదేవి పేర్కొన్నారు. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూర్ గ్రామంలో.. డా. ఆరుట్ల కమలాదేవి రామచంద్రా రెడ్డి ఫౌండేషన్, స్వామి రామానందతీర్ధ రూరల్ ఇనిస్ట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. గ్రామీణ మహిళలకు ఉచిత కుట్టు మెషీన్, ఎంబ్రాయిడింగ్ వర్క్తో పాటుగా మగ్గం వర్క్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపిన ఛైర్మన్.. మహిళలు అందరూ ఈ శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
స్వయంగా ఎదిగేలా..
మహిళ అంటే ఆరుట్లరామచంద్ర రెడ్డికి చాలా గౌరవమని తెలిపిన కమలాదేవి.. స్వంతంగా ఎదగాలని కోరుకునే మహిళలకు ఫౌండేషన్ ద్వారా ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి స్వయంగా ఉపాధి పొందే అవకాశం కల్పిస్తామని తెలిపారు .