తెలంగాణ

telangana

ETV Bharat / city

తెరాస నేతలు ప్రలోభ పెడుతున్నారు: సీపీఐ

నల్గొండ జిల్లా మునుగోడులో తెరాస నేతలు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని స్థానిక సీపీఐ నేతలు ఆరోపించారు. ఓటర్లను ఓ ఫంక్షన్​ హాల్​కు పిలిపించి.. డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు.

By

Published : Mar 14, 2021, 3:52 PM IST

trs
తెరాస నేతలు ప్రలోభ పెడుతున్నారు: సీపీఐ

నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో తెరాస నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని సీపీఐ నేతలు ఆరోపిస్తున్నారు. ఓ ఫంక్షన్ హల్​లో స్థానిక ఎంపీపీ ఆధ్వర్యంలో ఈ ప్రలోభాల పర్వం నడుస్తోందని చెప్పారు.

'ఓటర్లను నేరుగా పోలింగ్​ కేంద్రాలకు వెళ్లనివ్వకుండా ఫంక్షన్​ హాల్​లో కూర్చొబెట్టారు. ఓటర్​ స్లిప్​లపై తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడితో సంతకం చేయించుకొని.. డబ్బులు ఇస్తున్నారు. అనంతరం భోజనం పెట్టి పోలింగ్​ కేంద్రాలకు పంపుతున్నారు. ఇంత జరుగుతున్నా.. పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదు.'

-సీపీఐ నాయకులు

తెరాస నేతలు ప్రలోభ పెడుతున్నారు: సీపీఐ

ఇవీచూడండి:తెలంగాణ భాజపాపై పవన్ కల్యాణ్ గుస్సా

ABOUT THE AUTHOR

...view details