నయీం... తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో అనేక ప్రాంతాలకు తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించిన కరడుగట్టిన నేరస్థుడు. 2016 ఆగస్టు 8న షాద్నగర్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అప్పటి వరకు నయీం భయంతో గడిపిన వారందరూ బయటకురావడం మొదలు పెట్టారు. తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులు ముందు ఏకరవుపెట్టారు. తమ ఆస్తులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
250 కేసులు నమోదు..
బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది. బాధితులు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రత్యేక ఫోన్ నంబర్లు కేటాయించింది. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా అమెరికాతోపాటు ఇతర దేశాల నుంచీ ఫిర్యాదులందాయి. తమ ఆస్తులు కొల్లగొట్టాడని కొందరు.. తమ వారిని అంతమొందించాడని మరికొందరు ఫిర్యాదులు చేశారు. ఏకంగా 250 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 220 కేసుల్లోనే అభియోగపత్రాలు దాఖలు చేశారు.
1.67 లక్షల చదరపు గజాల ఇళ్ల స్థలాలు కబ్జా..
మూడేళ్లవుతున్నా దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. 21 కార్లు, 26 ద్విచక్రవాహనాలు, రూ.2.95 లక్షల నగదు, 1000 ఎకరాల వ్యవసాయ భూమి, 27 ఇళ్లు, 1.67 లక్షల చదరపు గజాల ఇళ్ల స్థలాల్ని కబ్బా చేశాడని పోలీసులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. అన్ని కేసుల దర్యాప్తు పూర్తి చేసి.. అభియోగ పత్రాలు దాఖలు చేస్తేనే గాని న్యాయ విచారణ సాధ్యం కాదు. బాధితుల ఆస్తులు నయీం కబ్బా చేసినట్లు నిరూపితమైతే తప్ప తిరిగి అప్పగించడం సాధ్యం కాదు. ఇదంతా ఎన్నేళ్లు పడుతుంతో తెలియడం లేదు.
సాంకేతిక సమస్యలు..