Alternative Crops: ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టిసారించాలన్న ప్రభుత్వ సూచన మేరకు పాలమూరు జిల్లాలో రైతులు మినుము వైపు మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రంలో సాధారణసాగు విస్తీర్ణంతో పోల్చితే ఈ యాసంగిలో 240 శాతం మినుము పంటను అధికంగా సాగుచేశారు. అందులో అధిక విస్తీర్ణం పాలమూరు జిల్లాలోనిదే. మంచి దిగుబడులు, కనీస మద్దతు ధరతో పోల్చితే బహిరంగ మార్కెట్లో అధిక ధర దక్కడం వల్ల ఎక్కువమంది వరికి బదులుగా మినుము ఎంచుకున్నారు. గతంతో పోల్చితే ఈసారి తెగుళ్ల దాడి రైతులను కాస్త ఇబ్బందులకు గురిచేసినా మినుము మంచి ప్రత్యామ్నాయమని భావిస్తున్నారు. విత్తనాల్లో రాయితీ, మార్కెటింగ్, తెగుళ్ల నివారణపై అవగాహన కల్పించి ప్రభుత్వం మినుము రైతులను ప్రోత్సహించాలని కోరుతున్నారు.
యాసంగిలో 58 వేల ఎకరాల్లో సాగు..
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ ఏడాది యాసంగిలో మినుము సాగు గణనీయంగా పెరిగింది. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలవైపు వెళ్లాలన్న వ్యవసాయశాఖ అధికారుల సూచన మేరకు వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులు ఎక్కువమంది మినుము పంట వైపు మొగ్గుచూపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మినుము సాధారణ సాగువిస్తీర్ణం 14వేల ఎకరాలు కాగా, ఈ ఏడాది నవంబర్ వరకూ 50 వేల ఎకరాల్లో రైతులు మినుము సాగుచేశారు. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో ఎక్కువ మంది మినుముపై ఆసక్తి చూపుతున్నారు. 2019 యాసంగిలో 13వేలకే పరిమితమైన సాగువిస్తీర్ణం, గతఏడాది 40 వేలఎకరాలకు చేరింది. ఈ ఏడాది 60వేల ఎకరాలకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పంట నమోదు ప్రక్రియ పూర్తైతే గణాంకాలు తేలనున్నాయి. సాధారణ సాగు విస్తీర్ణంతో పోల్చితే తెలంగాణలో 250 శాతం అధికంగా ఈసారి మినుగు సాగవుతోంది. తెలంగాణలో మినుము సాధారణ సాగువిస్తీర్ణం 24 వేల ఎకరాలు కాగా, 2019లో 16 వేలు, 2020లో 48 వేలు, ఈ ఏడాది యాసంగిలో 58 వేల ఎకరాలు సాగైంది
మినుము లాభదాయకమని..