తెలంగాణ

telangana

ETV Bharat / city

గుత్తేదారుల అలసత్వం ఉంటే చర్యలు తప్పవు: ప్రశాంత్​రెడ్డి - మహబూబ్​నగర్​లో మంత్రి ప్రశాంత్​రెడ్డి పర్యటన

వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు కోసం త్వరలోనే రూ.80 కోట్ల విడుదల చేయనున్నట్లు మంత్రి ప్రశాంత్​రెడ్డి తెలిపారు. మహబూబ్​నగర్​ జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్​ను మంత్రి శ్రీనివాస్ గౌడ్​తో కలిసి పరిశీలించారు. నత్తనడకన జరిగే పనులపై హైదరాబాద్​లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు.

Minister prashanth reddy  warns road repair contractors
గుత్తేదారుల అలసత్వం ఉంటే చర్యలు తప్పవు: ప్రశాంత్​రెడ్డి

By

Published : Oct 30, 2020, 5:52 PM IST

గుత్తేదారుల అలసత్వం ఉంటే చర్యలు తప్పవు: ప్రశాంత్​రెడ్డి

అన్ని రకాల హంగులతో రాష్ట్రంలో 26 కొత్త కలెక్టరేట్​లు నిర్మిస్తున్నామని, డిసెంబర్ కల్లా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మహబూబ్​నగర్​లో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్​ భవనాన్ని మంత్రి శ్రీనివాస్​గౌడ్​తో కలిసి పరిశీలించారు. ఇటీవల వర్షాలకు ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతుల కోసం రూ.80 కోట్ల వరకు త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు.

మహబూబ్ నగర్ నుంచి వికారాబాద్ వెళ్లే రహదారి సమస్యను సైతం త్వరలోనే తీరుస్తామని చెప్పారు. వేముల నుంచి దేవరకద్ర వెళ్లే రహదారి పనులు, బూత్పూర్ నుంచి మహబూబ్​నగర్ వచ్చే మార్గంలో అసంపూర్తిగా ఉన్న మూడు వంతెనలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గుత్తేదారుల అలసత్వం ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. నత్తనడకన జరిగే పనులపై హైదరాబాద్​లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు.

ఇవీ చూడండి:అబద్ధాల పునాదులపై గెలవాలని భాజపా ప్రయత్నిస్తోంది: హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details