తెలంగాణ

telangana

ETV Bharat / city

మహబూబ్​నగర్​ లోక్​సభ స్థానం ఎవరిది...?

మహబూబ్​నగర్​ స్థానంలో గెలుపుపై ప్రధాన రాజకీయ పార్టీలు వేటికవే ధీమాగా ఉన్నాయి. తెరాస కొత్త ముఖాన్ని బరిలో దింపగా... ఇటీవల కాంగ్రెస్​ను వీడి కమల తీర్థం పుచ్చుకున్న సీనియర్​ నాయకురాలు డీకే అరుణను భాజపా రంగంలోకి దింపింది. మరి ఎక్కువ సార్లు విజయం కైవసం చేసుకున్న కాంగ్రెస్​ అదే ఫలితం పునరావృతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

By

Published : May 22, 2019, 11:32 PM IST

మహబూబ్​నగర్​ లోక్​సభ

లోక్​సభ ఎన్నికల్లో మహబూబ్​నగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎవరు గెలుస్తారోనని రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ... తెరాస కొత్త వ్యక్తి మన్నె శ్రీనివాసరెడ్డిని బరిలో నిలపగా... కాంగ్రెస్​ నుంచి చల్లా వంశీచంద్​రెడ్డి పోటీ చేశారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్​కు షాక్​ ఇచ్చి పార్టీ సీనియర్​ నేత అరుణ భాజపాలో చేరి ఆ పార్టీ నుంచి బరిలో నిలిచారు. మరి గెలుపు ఎవరిని వరించనుందో మరి కొద్ది గంటల్లో తేలనుంది.

మహబూబ్​నగర్​ లోక్​సభ స్థానం ఎవరిది...?

ABOUT THE AUTHOR

...view details