తెలంగాణ

telangana

By

Published : Mar 22, 2020, 12:07 PM IST

ETV Bharat / city

కర్ఫ్యూ ఎఫెక్ట్​: నిర్మానుష్మంగా మారిన ఉమ్మడి వరంగల్​

ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూ పిలుపునకు అపూర్వ స్పందన లభిస్తోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వ్యాప్తంగా రహదారుల్లన్నీ మూగబోయాయి. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమైయ్యాయి. ప్రజల సాయంతో స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య సముదాయాలు మూతబడ్డాయి. మహబూబ్‌నగర్‌, ములుగు, జయశంకర్​ భూపాలపల్లిలో కర్ఫ్యూని పోలీసు బృందాలు పర్యవేక్షిస్తున్నాయి.

janatha curfew in union warangal
కర్ఫ్యూ ఎఫెక్ట్​: నిర్మానుష్మంగా మారిన ఉమ్మడి వరంగల్​

ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా... వ్యాపార వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. చిరు వ్యాపారులు సైతం కర్ఫ్యూ పాటిస్తున్నారు. వరంగల్‌లోని రహదారులు, ప్రధాన కూడళ్లు, రైల్వే స్టేషన్, బస్సు ప్రయాణ ప్రాంగణాలు జన సందడి లేక వెలవెలబోతున్నాయి.

మహబూబ్‌నగర్‌లో పట్టణ సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు కర్ఫ్యూని పర్యవేక్షిస్తున్నాయి. మున్సిపల్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి, కమిషనర్ ఇంద్రసేనారెడ్డి పట్టణంలో తిరుగుతూ ప్రజలెవరూ రహదారులపైకి రావద్దని మైక్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

ములుగులోనూ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఏటూరునాగారం, మంగపేట, వెంకటాపురం, వాజేడు, తాడ్వాయి, గోవిందరావుపేట, వెంకటాపుర్ మండలాల్లో ప్రజలు స్వీయ నిర్బంధం విధించుకున్నారు. జయశంకర్​ భూపాలపల్లిలో జనతా కర్ఫ్యూకు సింగరేణి సంపూర్ణ మద్దతు తెలిపింది. కార్మికులు, అధికారులు ఒక్కరోజు విధులకు హాజరు కాకుండా స్వీయ నిర్బంధం విధించుకున్నారు.

కర్ఫ్యూ ఎఫెక్ట్​: నిర్మానుష్మంగా మారిన ఉమ్మడి వరంగల్​

ఇవీ చూడండి:'రాష్ట్రంలో సకలం స్వీయ నిర్బంధం'

ABOUT THE AUTHOR

...view details