ఇంటర్మీడియట్ ఫలితాలు అవకతవకలపై విద్యా శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. ఎంపీ అభ్యర్థి మల్లు రవి, డి సి సి ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే వంశీ కృష్ణ ,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటర్ విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలని నినదించారు. గ్లోబరినా ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్కు వినతిపత్రాన్ని అందజేశారు.
గ్లోబరినాపై చర్యలు తీసుకోండి - TG_MBNR_10_25_INTER_CONG_COLLECTORATE_MUTTADI_AVB_
ఇంటర్ ఫలితాల గందరగోళంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్లోబరినా సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఎదుట కార్యకర్తలతో కలిసి ఎంపీ అభ్యర్థి మల్లు రవి నిరసన వ్యక్తం చేశారు.
![గ్లోబరినాపై చర్యలు తీసుకోండి](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3104910-thumbnail-3x2-mallu.jpg)
ఎంపీ అభ్యర్థి మల్లు రవి
ఎంపీ అభ్యర్థి మల్లు రవి
ఇవీ చూడండి: ప్రభుత్వంపై రాములమ్మ కన్నెర్ర