ఖమ్మంలో 38 నామపత్రాలు దాఖలు ఖమ్మం లోక్సభ ఎన్నికల బరిలో నిలిచిన తెరాస అభ్యర్థి నామ నాగేశ్వరరావు అట్టహాసంగా నామినేషన్ వేశారు. ఉదయం తన నివాసంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పార్టీ నేతలతో కలిసి అమరవీరుల స్థూపానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులు అర్పించారు. ఎస్ఆర్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానం నుంచి భారీ ర్యాలీతో కలెక్టరేట్కు బయలుదేరారు. మాజీ మంత్రి తుమ్మల, తెరాస ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇతర నేతలతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామ పత్రాలు అందజేశారు. పార్టీ కార్యాలయం నుంచి..
కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి కూడా భారీ ర్యాలీతో నామినేషన్ వేశారు. జిల్లా హస్తం పార్టీ కార్యాలయం నుంచి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, సీనియర్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, వీహెచ్, భట్టి విక్రమార్కతో కలిసి నామినేషన్ వేశారు.
38 నామపత్రాలు:
భాజపా తరఫున వాసుదేవరావు, న్యూడెమోక్రసీ నుంచి వెంకటేశ్వరరావుతో పాటు మరికొంత మంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు సమర్పించారు. ఖమ్మం లోక్సభ స్థానానికి 38 నామపత్రాలు దాఖలైనట్లు సమాచారం.
ఇదీ చదవండిఃతెరాస ప్రచార తార జాబితాలో హరీశ్