Security forces defused landmine: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటుచేసిన ముందు పాతరలను జవానులు కనుగొన్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని కీకారణ్యంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య రోజూ దాడి, ప్రతి దాడులు జరుగుతున్నాయి.
మందుపాతరను గుర్తించారు.. అలా పేల్చేశారు... - మందు పాతరల నిర్వీర్యం
Security forces defused landmine: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అటవీప్రాంతంలో మావోస్టులు అమర్చిన మందుపాతరలను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. పోలీసులను చంపటమే ప్రధాన ఉద్దేశంగా ఈ మందుపాతరలను పెట్టినట్టు జవానులు స్పష్టం చేశారు. 74 సీఆర్ఫీఎఫ్ బెటాలియన్ పోలీస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పేలుతున్న మందుపాతర
ఈ నేపథ్యంలో భద్రతా బలగాలపై మందుపాతరలు పేల్చి వేసేందుకు మావోయిస్టులు చేసిన పనిని జవానులు కనిపెట్టారు. ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలోని అరలంపల్లి, కిష్టారం మార్గమధ్యంలో పోలీసులను లక్యంగా చేసుకొని మావోయిస్టులు ఈ మందుపాతరలు అమర్చారు. మార్గమధ్యలో అమర్చిన రెండు మందుపాతరలను భద్రతా బలగాలు కనుగొని నిర్వీర్యం చేశాయి. 74 సీఆర్ఫీఎఫ్ బెటాలియన్ పోలీస్ పరిధిలో ఈ ఘటన జరిగింది.