తెలంగాణ

telangana

ETV Bharat / city

మంత్రి పువ్వాడ సైకిల్​ పర్యటన.. అభివృద్ధి పనుల పరిశీలన - మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సైకిల్ పర్యటన

ఖమ్మం నగర వీధుల్లో మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ సైకిల్​పై పర్యటించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. పనుల్లో నాణ్యతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు.

minister puvvada ajay kumar cycle tour in khammam city
మంత్రి పువ్వాడ సైకిల్​ పర్యటన.. అభివృద్ధి పనుల పరిశీలన

By

Published : Jul 8, 2020, 10:49 AM IST

పురపాలకశాఖ మంత్రి కేటీఆర్​ తోడ్పాటుతో ఖమ్మం నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ అన్నారు. జిల్లా కలెక్టర్ కర్ణన్, నగర కమిషనర్ అనురాగ్​ జయంతితో కలిసి... ఇవాళ ఉదయం సైకిల్​పై పర్యటించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అలసత్వం వహిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూడో పట్టణ ప్రాంతంలో రంగనాయకులగుట్ట వీధి వెడల్పు పనులకు అడ్డంగా ఉన్న స్తంభాలు తొలిగించాలని విద్యుత్ అధికారులను మంత్రి ఆదేశించారు. రోడ్ల నాణ్యతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులకు సూచనలు చేశారు. రైతుబజార్​, మయూరి కూడలి, కాల్వొడ్డు, వ్యవసాయ మార్కెట్​ ప్రాంతంలోని స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

మంత్రి పువ్వాడ సైకిల్​ పర్యటన.. అభివృద్ధి పనుల పరిశీలన

ఇదీ చూడండి:రెండో రోజు కొనసాగుతున్న సచివాలయం కూల్చివేత పనులు

ABOUT THE AUTHOR

...view details