డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరగకుండా చూడాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను సూచించారు. కరీంనగర్ నియోజకవర్గంలో 1400 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా.. దాదాపు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు టెండర్ ప్రక్రియ పూర్తి అయిందని మంత్రి పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఏవైనా అడ్డంకులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. చాలా గ్రామాల్లో ఇళ్ల నిర్మాణానికి భూమి కొరత ఉందని.. కలెక్టర్తో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని గంగుల స్పష్టం చేశారు.
లక్ష్యాన్ని అధిగమించాలి..