తెలంగాణ

telangana

ETV Bharat / city

'పేదల ఆకలి తీర్చాల్సిన బాధ్యత మాపై ఉంది'

కరీంనగర్‌లోని సీఎస్​ఐ చర్చి వద్ద మంత్రి గంగుల కమలాకర్​ చేతుల మీదగా పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ప్రభత్వంతో పాటు దాతలు కూడా ముందుకొచ్చి పేదలకు అండగా నిలవాలని గంగుల విజ్ఞప్తి చేశారు.

By

Published : Apr 12, 2020, 1:15 PM IST

minister gangula
నిత్యావసర వస్తువుల పంపిణీ

లాక్‌డౌన్‌ సమయంలో నిరుపేదలను ప్రభుత్వం ఆదుకుంటుందని, దాతలు కూడా ముందుకు రావాలని మంత్రి గంగుల కమలాకర్‌ విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతోన్న వారి ఆకలి తీర్చాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. కరీంనగర్‌లోని సీఎస్​ఐ చర్చి వద్ద పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ప్రజలంతా లాక్‌డౌన్‌కు సహకరిస్తూ... స్వీయనియంత్రణ పాటించాలని మంత్రి గంగుల కమలాకర్‌ కోరారు.

కరీంనగర్​లో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో గంగుల కమలాకర్​ కీలక పాత్ర పోషించారని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​ కుమార్ ప్రశంసించారు. ముఖ్యమంత్రి కూడా గంగులను అభినందించినట్లు తెలిపారు. కరీంనగర్​ పోలీసుల చోరవతోనే ఇండోనేషియా వాసుల వివరాలు ముందుగా కేంద్రానికి తెలిపడం జరిగిందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కరీంనగర్​ పోలీసు యంత్రాంగాన్ని వినోద్​ అభినందించారు. కార్యక్రమంలో కరీంనగర్​ మేయర్​, డిప్యూటి మేయర్​ ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:చికెన్​ బిర్యానీ పెట్టలేదని కరోనా రోగికి కోపమొచ్చింది!

ABOUT THE AUTHOR

...view details