తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆర్టీపీసీఆర్​ ల్యాబ్ ఏర్పాటై రెండు నెలలైనా.. - కరీంనగర్​లో ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు

కరోనాను అడ్డుకునేందుకు ర్యాపిడ్‌ యాంటిజెన్ పరీక్షలతో పాటు ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. కరీంనగర్‌లో కరోనా పరీక్షల కోసం రెండు నెలల క్రితం ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్​ ల్యాబ్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఫలితంగా ఇప్పటికీ నమూనాలు సేకరించి హైదరాబాద్‌ పంపే ప్రక్రియ కొనసాగుతోంది.

karimnagar rtpcr lab
ఆర్టీపీసీఆర్​ ల్యాబ్ ఏర్పాటై రెండు నెలలైనా..

By

Published : Oct 10, 2020, 5:38 AM IST

కరీంనగర్‌లో కరోనా పరీక్షల కోసం రెండు నెలల క్రితం ఆర్టీపీసీఆర్​ ల్యాబ్ ఏర్పాటు చేసినా.. ఇంతవరకు వినియోగంలోకి రాలేదు. పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినా.. ఐసీఎంఆర్​ నుంచి అనుమతి రాకపోవడంతో ఇప్పటికీ.. నమునాలను హైదరాబాద్‌కు పంపిస్తున్నారు. ఫలితంగా నమూనాల కోసం మూడు నుంచి వారం రోజులు వేచి ఉండాల్సి వస్తోంది.

లక్షణాలు ఉన్నవారికి యాంటీజెన్ పరీక్షలో నెగిటివ్ వచ్చినప్పుడు.. విధిగా ఆర్టీపీసీఆర్​ పరీక్షలు చేయించుకోవాలని ఐసీఎంఆర్​ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ఆ కేంద్రం ప్రారంభం కాకపోవడంతో.. పరీక్షలకు వచ్చినవారు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే పరీక్షలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జిల్లా వైద్యాధికారి సుజాత తెలిపారు.

ఇవీ చూడండి:సోమవారం నుంచి ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలు

ABOUT THE AUTHOR

...view details