తెలంగాణ

telangana

ETV Bharat / city

రద్దీ ప్రాంతాల్లో తనిఖీలకు ప్రత్యేక పోలీసు బృందాలు - కరీంనగర్​లో తనిఖీలకు ప్రత్యేక పోలీసుల బృందాలు

కరోనా వైరస్​ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కరీంనగర్ సీపీ కమలాసన్​రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు.

karimnagar Police focus on  Social Distance to control corona
రద్దీ ప్రాంతాల్లో తనిఖీలకు ప్రత్యేక పోలీసుల బృందాలు

By

Published : Apr 19, 2020, 7:25 PM IST

కరీంనగర్​లో బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడంపై పోలీసులు.. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆదివారం రోజున చికెన్​, మటన్​ విక్రయ కేంద్రాల్లో రద్దీపై దృష్టిసారించారు. తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు.

ప్రధానంగా నగరంలో అతి రద్దీగా ఉండే 13 ప్రాంతాలను గుర్తించిన సీపీ కమలాసన్​రెడ్డి.. రద్దీ సమాచారం వెనువెంటనే హెడ్‌క్వార్టర్‌కు చేరే విధంగా చర్యలు తీసుకున్నారు. డీసీపీ చంద్రమోహన్‌తో పాటు ఏసీపీ అశోక్‌కుమార్‌ ఆయా మార్కెట్‌లలో పర్యటించారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తున్నారా.. మాస్కులు ధరిస్తున్నారా అని పరిశీలించారు. నిబంధనలు పాటించనివారికి అవగాహన కల్పిస్తున్నారు.

ఇవీచూడండి:ఆంక్షలు ఫలించిన వేళ.. సడలింపులకు సమాయత్తం

ABOUT THE AUTHOR

...view details