తెలంగాణ

telangana

కొండగట్టులో భక్తులపై తేనెటీగల దాడి

By

Published : Apr 22, 2019, 1:06 PM IST

జగిత్యాల జిల్లా కొండగట్టులో భక్తులపై తేనెటీగల దాడి జరిగింది. ఘటనలో 10 మంది భక్తులు గాయపడగా వారిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

భక్తులపై తేనెటీగల దాడి

జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో భక్తులపై తేనెటీగల దాడి జరిగింది. దైవ దర్శనానంతరం చెట్టుకింద వంట చేసుకునేటప్పుడు వచ్చిన పొగతో ఒక్కసారిగా తేనెటీగలు భక్తులపైకి ఎగబడ్డాయి. ఈ ఘటనలో 10 మందికి గాయాలవ్వగా... వారిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. క్షతగాత్రులందరూ కరీంనగర్​ వాసులుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన భూమయ్య, మల్లేశ్​, శంకర్​లకు డాక్టర్లు మెరుగైన వైద్యం అందించారు.

భక్తులపై తేనెటీగల దాడి

ABOUT THE AUTHOR

...view details