తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆర్టీసీ డ్రైవర్​ నిర్లక్ష్యం... ఒకరి దుర్మరణం..

కరీంనగర్​ జిల్లా బొమ్మకల్​ వద్ద ఓ ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. డ్రైవర్​ నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ ఘటనలో ఒకరు మరణించగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

By

Published : Apr 17, 2019, 5:41 PM IST

కరీంనగర్​లో ఆర్టీసీ బస్సు-ద్విచక్రవాహనం ఢీ

ఆర్టీసీ బస్సు డ్రైవరు నిర్లక్ష్యం ఒకరి ప్రాణం తీసింది. కరీంనగర్​ జిల్లా బొమ్మకల్​ వద్ద గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఒకరు మృతి చెందగా మరొకరు తృటిలో తప్పించుకున్నారు. స్థానిక సుల్తాన్​బజార్​లో వెల్డింగ్​ పనులు చేసుకుని వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మహ్మద్​ సాజిద్​ అక్కడికక్కడే మరణించగా మహ్మద్​ షేక్​ను కరీంనగర్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.

కరీంనగర్​లో ఆర్టీసీ బస్సు-ద్విచక్రవాహనం ఢీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details