తెలంగాణ

telangana

Food Poison: ఉగాది పచ్చడి తాగి 27 మంది విద్యార్థులకు అస్వస్థత

By

Published : Apr 3, 2022, 2:35 PM IST

Food Poison: ఉగాది పచ్చడి తాగి 27మంది గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. అనారోగ్యానికి గురైన వారందరినీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Food Poison
Food Poison

Food Poison: జగిత్యాల జిల్లా మెట్​పల్లి శివారులోని బీసీ గురుకుల పాఠశాలలో ఉగాది పచ్చడి తాగి 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. ఇప్పుడు పిల్లలందరూ క్షేమంగానే ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు.

ఉగాది పండుగను పురస్కరించుకొని తల్లిదండ్రులు ఉగాది పచ్చడిని తెచ్చారు. శనివారం సాయంత్రం అది తాగిన ఐదో తరగతికి చెందిన 27 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే విద్యార్థులందరినీ హుటాహుటిన మెట్​పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

విషయం తెలుసుకున్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్​రావు ప్రభుత్వాసుపత్రికి వచ్చి పిల్లలను పరామర్శించారు. ఏలా జరిగిందనే విషయాన్ని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఆనందంను అడిగి తెలుసుకున్నారు . పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

ఇదీ చదవండి:వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు చనిపోయాడంటూ ఆందోళన

ABOUT THE AUTHOR

...view details