తెలంగాణ

telangana

By

Published : Aug 8, 2021, 3:32 PM IST

Updated : Aug 8, 2021, 3:57 PM IST

ETV Bharat / city

YV Subbareddy: తితిదే ఛైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి

ఏపీ ప్రభుత్వం తితిదే నూతన ఛైర్మన్‌ను నియమించింది. మరోసారి వైకాపా సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బోర్డు సభ్యులను కూడా త్వరలో నియమించనుంది.

http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/08-August-2021/12710945_yv-subhareddy.jpg
http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/08-August-2021/12710945_yv-subhareddy.jpg

తితిదే ఛైర్మన్‌గా మరోసారి వైకాపా సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తితిదే ఛైర్మన్‌గా సుబ్బారెడ్డిని నియమించింది. ఇటీవలే ఆయన పదవీకాలం పూర్తయింది.

ఈ నేపథ్యంలో కొత్త వ్యక్తికి తితిదే ఛైర్మన్‌గా అవకాశం కల్పిస్తారనే ఊహాగానాలు వచ్చినప్పటికీ మళ్లీ సుబ్బారెడ్డినే నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే తితిదే బోర్డు సభ్యులను కూడా నియమించనున్నారు.

ఇదీ చదవండి:AMARAVATI: రాజధాని గ్రామాల్లో ఉద్రిక్తత.. పోలీసుల కఠిన ఆంక్షలు

Last Updated : Aug 8, 2021, 3:57 PM IST

ABOUT THE AUTHOR

...view details