రైతులకు నష్టం లేకుండా బీమా సొమ్ము అందించాలన్నదే తమ లక్ష్యం అని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పంట నష్టం జరిగితే బీమా వస్తుందన్న నమ్మకం రైతుల్లో కలగాలన్న సీఎం.. కోటి 14 లక్షల ఎకరాలను బీమా పరిధిలోకి తీసుకొచ్చామని వివరించారు.
రైతుల ఖాతాల్లో రూ.1252 కోట్ల పంట బీమా సొమ్ము జమ - ఏపీ తాజా వార్తలు
ఏపీలో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ప్రారంభించారు. కలెక్టర్లు, లబ్ధిదారులతో ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రూ.1,252 కోట్ల బీమా సొమ్మును రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. 2019 ఖరీఫ్లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు పరిహారం అందించనున్నారు.
రైతుల ఖాతాల్లో రూ.1252 కోట్ల పంట బీమా సొమ్ము జమ
ఏపీలో 10,641 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయని..గ్రామ సచివాలయాలతో ఆర్బీకేలను అనుసంధానించామన్నారు. ఆర్బీకే పరిధిలోని ఈ-క్రాపింగ్ డేటా ఆధారంగా పంట నష్టం వివరాలు తెలుసుకుంటున్నామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు.