చనిపోయిన వ్యక్తి (వైఎస్సార్) గురించి మాట్లాడే ముందు తెలంగాణ మంత్రులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని షర్మిల పార్టీ అడ్హక్ కమిటీ సభ్యురాలు ఇందిరా శోభన్ అన్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్లోని పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత పాలమూరు జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టింది మీరేనని రాష్ట్ర మంత్రులనుద్దేశించి ఆరోపించారు.
వైఎస్ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు..
మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజన్తోనే దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం అయిందని ఇందిరా శోభన్ అన్నారు. వైఎస్ మరణాంతరం తెలంగాణలో 700 మంది గుండె పగిలి చనిపోయారని గుర్తుచేశారు. వైఎస్ను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని ఇందిరా శోభన్ తెలిపారు.