తెలంగాణ

telangana

By

Published : Feb 9, 2021, 11:31 AM IST

ETV Bharat / city

లోటస్​పాండ్​లో అభిమానులతో షర్మిల సమావేశం

హైదరాబాద్ లోటస్​పాండ్​లో అభిమానులు, వైకాపా నేతలతో ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. తెలంగాణ కార్యకలాపాలపై ప్రధానంగా చర్చించారు.

ys-sharmila-meeting-with-fans-at-lotus-pond
లోటస్​పాండ్​లో అభిమానులతో షర్మిల సమావేశం

హైదరాబాద్ లోటస్​పాండ్​లో వైఎస్సార్ అభిమానులతో ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. లోటల్ పాండ్​లోని తన నివాసంలో సన్నిహితులు, అభిమానులతో సమావేశమయ్యారు. ఆమె ఇంటి వద్ద అభిమానులు, వైకాపా నేతలు బాణాసంచా కాలుస్తూ కోలాహలం చేశారు.

షర్మిల ఇంటి వద్ద ఏపీ సీఎం జగన్ ఫొటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రతి రెండ్రోజులకు ఒక ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశమవుతారని సమాచారం. నేడు ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో భేటీ అయ్యారు. తెలంగాణ కార్యకలాపాలపై ప్రధానంగా చర్చించారు.

ABOUT THE AUTHOR

...view details