తెలంగాణ

telangana

ఏపీలోని ప్రకాశం జిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ మరణం

By

Published : May 17, 2021, 9:53 PM IST

ప్రకాశం జిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ మరణం నమోదైంది. చీరాల మండలంలోని పేరాలకు చెందిన ఓ వ్యక్తి ఈ వ్యాధి కారణంగా హైదరాబాద్​లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

young man died with black fungus disease in chirala
ప్రకాశం జిల్లాలో బ్లాక్ ఫంగస్ మరణం

ప్రకాశం జిల్లా చీరాల మండలం పేరాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకడంతో చికిత్స నిమిత్తం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా.. అనారోగ్యానికి గురయ్యాడు. పరీక్షించిన వైద్యులు బాధితుడికి బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకినట్లు నిర్ధరించారు.

దీంతో మెరుగైన వైద్యం కోసం బాధితుడిని హైదరాబాద్​కు తరలించారు. శస్త్ర చికిత్స చేసి దవడను తొలగించిన వైద్యులు.. వెంటిలేటర్​పై ఉంచారు. ఈ క్రమంలో ఆరోగ్యం మరింత విషమించి సోమవారం ఉదయం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటికి ఆసరాగా ఉన్న కొడుకును కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని మృతుడి తల్లి కన్నీటిపర్యంతమయ్యారు.

ఇదీ చదవండి:కొవిడ్ నియంత్రణలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్

ABOUT THE AUTHOR

...view details