తెలంగాణ

telangana

ETV Bharat / city

'తెలుగు నేర్చుకోవడాన్ని అంటరానితనంతో పోల్చడం బాధాకరం' - ycp mp raghurama krishna raju criticise cm jagan on telugu medium untouchabilit comments news

మాతృభాష నేర్చుకోవడాన్ని అంటరానితనంతో ఏపీ సీఎం జగన్ పోల్చడం బాధాకరమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. అమరావతి కోసం శనివారం మరో రైతు గుండె ఆగిందన్న ఆయన.. అమరావతి రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. రైతులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని పేర్కొన్నారు.

raghurama krishna raju
'తెలుగు నేర్చుకోవడాన్ని అంటరానితనంతో పోల్చడం బాధాకరం'

By

Published : Aug 15, 2020, 10:40 PM IST

తెలుగు నేర్చుకోవడాన్ని అంటరానితనంతో ఏపీ ముఖ్యమంత్రి పోల్చడం బాధాకరమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. మాతృభాషను ప్రతి ఒక్కరూ గౌరవించాలని స్పష్టం చేశారు.

ఆంగ్ల మాధ్యమాన్ని కొందరు నేతలు అడ్డుకుంటున్నారని ఏపీ సీఎం చెప్పడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అమరావతి రైతులు మరణిస్తున్నందున వారికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్​పై ఉందన్నారు.

'తెలుగు నేర్చుకోవడాన్ని అంటరానితనంతో పోల్చడం బాధాకరం'

ఇవీచూడండి:మంత్రులు జిల్లాల్లోనే ఉండాలి... పరిస్థితిని పర్యవేక్షించాలి : సీఎం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details