తెలంగాణ

telangana

పోలీసులకు చిక్కిన "కిలాడీ" జంట...!

By

Published : Oct 31, 2019, 2:22 PM IST

వ్యాపారిని బెదిరించి, నగదు వసూలు చేసిన కిలాడీ జంటను..  హైదరాబాద్​ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వ్యాపారి నుంచి రూ.20 లక్షలు వసూలు చేసి, మరో కోటి రూపాయలకు ఒప్పంద పత్రం రాయించుకున్న కేసులో వీరు ప్రధాన నిందితులు.

"కిలాడీ" జంట

హైదరాబాద్‌ వ్యాపారిని బెదిరించిన ఎయిర్‌హోస్టెస్ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. మొయినాబాద్‌లో ఓ రిసార్ట్‌లో వ్యాపారితో ఎయిర్‌హోస్టెస్ సన్నిహితంగా గడిపింది. ఆ దృశ్యాలు చరవాణిలో చిత్రీకరించి.. వాటి ఆధారంగా భార్యభర్తలు బెదిరింపులకు పాల్పడ్డారు. వ్యాపారి నుంచి రూ.20 లక్షలు వసూలు చేసి, మరో కోటి రూపాయలకు ఒప్పంద పత్రం రాయించుకున్నారు. బాధిత వ్యాపారి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి ఎయిర్‌హోస్టెస్ దంపతులను అరెస్టు చేశారు.

పోలీసులకు చిక్కిన "కిలాడీ" జంట...!

ABOUT THE AUTHOR

...view details