VIRASAM Maha Sabhalu: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో.. తెలుగు రాష్ట్రాల విప్లవ రచయితల సంఘం మహాసభలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు నిర్వహించే ఈ 28 వ విరసం మహా సభలకు వివిధ రాష్ట్రాల నుంచి రచయితలు తరలివచ్చారు. తొలుత నెల్లూరు నగరంలోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో కోవూరులోని సుందరయ్య భవన్లో మహా సభలు ప్రారంభించారు.
విరసం మహాసభలు.. తరలివచ్చిన తెలుగు రాష్ట్రాల రచయితలు - ఏపీ వార్తలు
VIRASAM Maha Sabhalu: ఇరు తెలుగు రాష్ట్రాల విప్లవ రచయితల సంఘం(విరసం) మహాసభలు ఏపీలోని కోవూరులో ప్రారంభమయ్యాయి. రెండ్రోజులపాటు జరిగే ఈ సమావేశాలకు.. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి 200 మంది రచయితలు తరలివచ్చారు.
![విరసం మహాసభలు.. తరలివచ్చిన తెలుగు రాష్ట్రాల రచయితలు VIRASAM Maha Sabhalu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14131601-624-14131601-1641637501427.jpg)
విరసం మహా సభలు
విరసం ఏర్పడి 52 ఏళ్లు పూర్తయిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సభలో 20 పుస్తకాలను ఆవిష్కరిస్తామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుబట్టిన పలువురు వక్తలు.. మోదీ ఆధిపత్య నిర్ణయాలను ఖండించారు. మరోవైపు సభ వద్ద ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్తో పాటు స్థానిక పోలీసులు పెద్ద సంఖ్యలో నిఘా ఉంచారు.
ఇదీ చదవండి:Ministers on Shivraj singh: 'వంద ఎలుకలు తిన్న పిల్లి శాకాహారిని అన్నట్లు ఉంది'