తెలంగాణ

telangana

ETV Bharat / city

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - hero suman visit to tirumala temple

తిరుమల వైకుంఠనాథుణ్ని తెలంగాణ గవర్నర్ తమిళిసైతో పాటు ఏపీ రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనానంతరం తితిదే అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.

vips-visit-to-tirumala-balaji-temple
తిరుమల వైకుంఠనాథుని సేవలో ప్రముఖులు

By

Published : Jan 24, 2021, 3:48 PM IST

తిరుమల శ్రీవారిని వీఐపీ దర్శన సమయంలో ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. రాష్ట్ర గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబసమేతంగా స్వామిసేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు.

స్వామివారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు. అర్చకులు గవర్నర్​కు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కరోనా నివారణకు వ్యాక్సిన్ రావడంపై.. తమిళిసై ఆనందం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ విషయంలో ఎవరూ అనుమానించాల్సిన అవసరం లేదన్నారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.

స్వామివారి సేవలో హీరో సుమన్

సినీ హీరో సుమన్.. వైకుంఠనాథుడిని సేవలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి కరోనా నుంచి రక్షణ పొందాలని కోరారు. తన 43 ఏళ్ల సినీ ప్రస్థానంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. మరిన్ని మంచి పాత్రలు చేసేలా ప్రయత్నం చేస్తానన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details