'తెలంగాణ చిరువ్యాపారులకు సాయం చేయండి' - telangana planning commission letter to central finance minister
తెలంగాణలో అర్హులైన చిరువ్యాపారులు, నిరుద్యోగులకు ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం కింద రుణాలు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ లేఖ రాశారు.
!['తెలంగాణ చిరువ్యాపారులకు సాయం చేయండి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4739137-314-4739137-1570963582177.jpg)
ఆర్థిక మంత్రికి రాష్ట్ర ప్రణాళిక సంఘం వినతి
ముద్ర రుణాల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగుతోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అర్హులైన చిరు వ్యాపారులు, నిరుద్యోగులకు ఈ పథకం కింద రుణాలు మంజూరు చేసేలా చూడాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. ముద్ర పథకంలో రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. తెలంగాణకు విరివిగా సాయం అందేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు.
- ఇదీ చూడండి : అలర్ట్: ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల