హైదరాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం హిందు, ముస్లింల ఐక్యతకు నిదర్శనమని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్, ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి అమ్మవారి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.
'హిందు-ముస్లిం ఐక్యతకు భాగ్యలక్ష్మి దేవాలయం నిదర్శనం' - telangana news
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్, ఇతర కాంగ్రెస్ నేతలు దర్శించుకున్నారు. అమ్మవారి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. హిందు, ముస్లింలు పరస్పరం గౌరవించుకోవాలని వీహెచ్ సూచించారు.
!['హిందు-ముస్లిం ఐక్యతకు భాగ్యలక్ష్మి దేవాలయం నిదర్శనం' v hanumantharao visited oldcity bhagya lakshmi temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9937035-1056-9937035-1608383184603.jpg)
'హిందుముస్లిం ఐక్యతకు భాగ్యలక్ష్మి దేవాలయం నిదర్శనం'
హిందు, ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసుండాలని హనుమంతరావు ఆకాంక్షించారు. ఒకరినొకరు గౌరవించుకోవాలన్నారు. కొందరు మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని.. అవి మానుకోవాలని వీహెచ్ హితవు పలికారు. ఓట్ల కోసం ప్రజలను రెచ్చగొట్టొద్దని కోరారు.
ఇదీ చూడండి: సోమవారం నుంచి పాతపద్ధతిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు