తెలంగాణ

telangana

By

Published : Nov 17, 2019, 5:01 PM IST

ETV Bharat / city

'సునీల్​ శర్మ అఫిడవిట్​ను సుమోటోగా తీసుకోవాలి'

ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ సునీల్‌ శర్మ తీరుపై కాంగ్రెస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సునీల్‌శర్మ సమర్పించిన అఫిడవిట్‌ను న్యాయస్థానం సుమోటోగా స్వీకరించాలని పీసీసీ చీఫ్​ ఉత్తమ్​ కోరారు.

'సునీల్​ శర్మ అఫిడవిట్​ను సుమోటోగా తీసుకోవాలి'

హైకోర్టులో ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ సునీల్​ శర్మ సమర్పించిన అఫిడవిట్​పై టీపీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఒక ఐఏఎస్​ ఆధికారి చెప్పడం సరికాదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అన్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ఆలోచనలేవి తమకు లేవని తెలిపారు. ఆర్టీసీ ఇం​ఛార్జీ ఎండీపై చర్యలు తీసుకోవాలని కోరారు. సునీల్‌శర్మ సమర్పించిన అఫిడవిట్‌ను న్యాయస్థానం సుమోటోగా స్వీకరించాలని కోరారు. ఎవరి ప్రోద్భలంతో నిరాధార అంశంపై కోర్టులో అఫిడవిట్ వేశారని ఆయన ప్రశ్నించారు. ఈ అంశాన్ని లోక్​సభలో కూడా లేవనెత్తుతామని ఉత్తమ్​ పేర్కొన్నారు.

'సునీల్​ శర్మ అఫిడవిట్​ను సుమోటోగా తీసుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details