తెలంగాణ

telangana

ETV Bharat / city

బంగారు బియ్యం గింజపై జో బైడెన్ పేరు - సూక్ష్మ కళాకారుడు రాచకొండ రాజు వార్తలు

హైదరాబాద్‌కు చెందిన సూక్ష్మ కళాకారుడు రాచకొండ రాజు.. అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ పేరును బంగారు బియ్యం గింజపై రాశారు. మంత్రుల అధికారిక నివాసంలో దీనిని స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి ఆవిష్కరించారు.

Us President joe biden Name On gold Rice in hyderabad
బంగారు బియ్యం గింజపై జో బైడెన్ పేరు

By

Published : Jan 19, 2021, 3:19 PM IST

అమెరికా నూతన అధ్యక్షునిగా జో బైడెన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా.. హైదరాబాద్‌కు చెందిన సూక్ష్మ కళాకారుడు రాచకొండ రాజు జో బైడెన్ పేరును బంగారు బియ్యం గింజపై రాశారు. మంత్రుల అధికారిక నివాసంలో దీనిని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ఆవిష్కరించారు.

ఆవిష్కరిస్తున్న స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి

యువత నూతనంగా ఆలోచించి ముందుకు వెళ్లాలని పోచారం అన్నారు. కళకు సృజనాత్మకత జోడిస్తే అపార అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సూక్ష్మ కళాకారుడు రాజును పోచారం అభినందించారు.

ఇదీ చూడండి:భాజపాతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం: విజయశాంతి

ABOUT THE AUTHOR

...view details