సంగారెడ్డి జిల్లాలోని ముత్తంగా కళాశాలలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రాష్ట్రంలో ఉన్న 8 కళాశాలల నుంచి 35 మంది క్రీడాకారిణులు హాజరయ్యారు. కబడ్డీ, కోకో, వాలీబాల్ షటిల్, టెన్నికాయిట్, హైజంప్, లాంగ్జంప్ వంటి 9 రకాల అవుట్ డోర్ గేమ్స్.... క్యారమ్స్, చెస్ వంటి ఇండోర్ గేమ్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని గచ్చిబౌలిలో నిర్వహించే సొసైటీ లీగ్లో పోటీపడనున్నారు. అక్కడ గెలిచిన వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేందుకు అవకాశం కలుగుతుంది. మూడు రోజులపాటు పండుగలా ఈ క్రీడలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
గురుకుల కళాశాలల్లో స్పోర్ట్స్ మీట్కు అపూర్వ స్పందన - Annual Sports Meet 2019
క్రీడల్లో గురుకుల పాఠశాలకు, కళాశాలలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. చదువుతో పాటు ఆటల్లో కూడా విద్యార్థినులు రాణించేలా స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తోంది. మహాత్మ జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థినులు పాల్గొంటున్నారు.
![గురుకుల కళాశాలల్లో స్పోర్ట్స్ మీట్కు అపూర్వ స్పందన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4985531-781-4985531-1573095218359.jpg)
గురుకుల కళాశాలల్లో స్పోర్ట్స్ మీట్కు అపూర్వ స్పదన
గురుకుల కళాశాలల్లో స్పోర్ట్స్ మీట్కు అపూర్వ స్పదన
Last Updated : Nov 9, 2019, 10:42 AM IST