మేడ్చల్ జిల్లా దూలపల్లిలో టాటాఏస్ ఆటో వెనుక చక్రాల కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. వినీత- శ్రవణ్ దంపతులు దూలపల్లిలో నివాసముంటున్నారు. వారి రెండేళ్ల కూతురు ఆరాధ్య. గురువారం మధ్యాహ్నం పాప మామ టాటాఏస్ వాహనాన్ని వెనక్కి తీస్తుండగా వెనక చక్రాలు పాప పైకి ఎక్కాయి. ప్రమాదవాశాత్తు జరిగిన ఈ ఘటనలో ఆరాధ్య అక్కడి అక్కడే మృతి చెందింది.
ఆటో చక్రాల కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి - two years baby died at petbasheerabad ps
పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలోని దూలపల్లిలో దారుణం చోటుచేసుకుంది. బుడి బుడి అడుగులు వేస్తూ...అప్పటివరకు కళ్లముందు అడుతూ కనిపించిన ఆ చిన్నారి మృతితో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. టాటాఏస్ ఆటో చక్రాల కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందడం అందరినీ కలచివేసింది.
![ఆటో చక్రాల కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి two years baby died in auto accident at dulapally](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6312358-916-6312358-1583462788246.jpg)
ఆటో చక్రాల కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి
ఘటన స్థలానికి చేరికున్న పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో చక్రాల కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి
ఇదీ చూడండి:ఏడడుగులు వేశాడు.. ఏడేళ్లు నరకం చూశాడు
TAGGED:
two years baby died case